అగ్రరాజ్యం అమెరికాకు డ్రాగన్ దేశం చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారంలో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనకు రాబోతున్నట్లు తెలిసిందే. ఈ పర్యటనను చైనా ఖండిరచింది. తైవాన్ తమ దేశంలో భాగమేనని చైనా చాలా కాలంగా గొంతు చించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా మాత్రం తైవాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి రaావో లిజియాన్ మాట్లాడుతూ చైనా ప్రభుత్వం ఈ పర్యటనను పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అమెరికా ఇదే పద్ధతిలో ప్రవర్తిస్తే, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చైనా చాలా కఠిన చర్యలు తీసుకోకతప్పదు. ఆ తర్వాత జరిగే పరిణామాలన్నింటికీ అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అని హెచ్చరించారు.














