Skip to main content

Namaste NRI

ఎర్రర్‌ 500 టీజర్‌ ని లాంచ్‌ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

జస్వంత్‌ పడాల, నక్షత్ర త్రినయని జంటగా నటిస్తున్న చిత్రం ఎర్రర్‌ 500. ఎన్‌.సాందీప్‌ మైత్రేయ దర్శకుడు. యు. బాలరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  తెలుగు చిత్ర పరిశ్రమకి యువతరం రావాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.  ఎర్రర్‌ 500 టీజర్‌ బాగుంది. యూనిట్‌ ఎంతో ఫ్యాషన్‌తో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి అన్నారు. అనంతరం  హీరో జస్వంత్‌ మాట్లాడుతూ అందరికీ కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. నన్ను హీరోగా పరిచయం చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు అన్నారు. వినూత్నమైన కథతో చక్కటి ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందించాం. ఈ చిత్రంలో జస్వంత్‌ను హీరోగా పరిచయడం చేయడం ఆనందంగా ఉంది అన్నారు చిత్ర దర్శకుడు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: ఫణి కల్యాణ్‌, ఛాయాగ్రహణం: గ్యారీ బిహెచ్‌.

Social Share Spread Message

Latest News