Skip to main content

Namaste NRI

కశ్మీర్‌ ఫైల్స్‌ చూసి నిజాలు తెలుసుకోండి

దర్శన్‌ కుమార్‌, మిథన్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కశ్మీర్‌ ఫైల్స్‌. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా వివరాలను చిత్రం బృందం  తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి మాట్లాడుతూ 90వ దశకంలో కార్మీర్‌ పండిట్లపై తీవ్రమైన హింస జరిగింది. ఆ హింస గురించి మనకే పూర్తిగా తెలియకపోవడం విచారకరం. అక్కడి విషయాలన్నీ పరోక్షంగా తెలిసినవే గానీ అక్కడికి వెళ్లి ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ బాధితుల ఆవేదనకు ప్రతిరూపమే మా సినిమా అన్నారు. నాలుగేళ్ల పాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. సినిమా చూసి నిజాలు తెలుసుకోండి అన్నారు. చిన్నయ్‌ మాండ్లేకర్‌, ప్రకాష్‌ బెలవాడి, పునీత్‌ ఇస్సార్‌ కీలక పాత్రలు పోషించారు. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌, పల్లవి జోషి సంయుక్తంగా నిర్మించారు.  ఈ కార్యక్రమంలో నటుడు దర్శన్‌ కుమార్‌, నటి పల్లవి జోషి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, బీజేపీ నాయకుడు రామచంద్రరావు, పరిపూర్ణానంద స్వామి  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News