Skip to main content

Namaste NRI

గల్వాన్‌ ఘటన తర్వాత తొలిసారిగా… మోదీ, జిన్‌పింగ్‌

భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన గల్వాన్‌ ఘర్షణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కరచాలనం చేసుకొన్నారు. ఇందుకు ఇండోనేషియాలోని బాలి వేదికైంది. జీ 20 సదస్సులో పాల్గొంటున్న వీరిద్దరు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ చేయి అందించగా, మోదీ కరచాలనం స్వీకరించారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొన్నారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని అక్కడున్నవారంతా ఆసక్తిగా తిలకించారు.

Social Share Spread Message

Latest News