
సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శారీ. ఆర్జీవి, ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్గా దర్శకుడు గిరికృష్ణ తెరకెక్కించారు. ఏప్రిల్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి కథనందించిన ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ మన వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేసుకోవడం వల్ల జీవితంలో చాలా ఇబ్బందులొస్తాయనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్త పడతారు అన్నారు. తనకిది డ్రీమ్ ప్రాజెక్ట్ అని కథానాయిక ఆరాధ్యదేవి ఆనందం వ్యక్తం చేసింది.
