Skip to main content

Namaste NRI

ఈ విషయంలో భారత్ మరొకసారి ఆలోచించాలి: ఉక్రెయిన్ ఎంపీ

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో తమకు భారత్‌ అందించిన సహకారానికి ఉక్రెయిన్‌ ఎంపీ స్వియాటోస్లావ్‌ యురాష్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయించే దేశాల్లో భారత్‌ ఒకటని కొనియాడారు.  మా అధ్యక్షుడితో భారత ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌ తీసుకున్న మానవీయ చర్యలకు రుణపడి ఉంటామన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత్‌ ఆలోచించుకోవాలని సూచించారు. రష్యా, భారత్‌ మధ్య మిలటరీ, వ్యూహాత్మక స్నేహబంధాలు ఉన్నాయని, ఈ విషయంలో భారత్‌ మరొకసారి ఆలోచించుకోవాలని సూచించారు. గడిచిన 20 ఏళ్లలో పుతిన్‌ హయంలో రష్యా చేసిన దారునాలను గుర్తించాలని, ఈ విషయాల్లో రష్యాను భారత్‌ శిక్షించాలని కోరారు.

Social Share Spread Message

Latest News