Skip to main content

Namaste NRI

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

రోహిత్‌, మేఘన రాజ్‌పుత్‌ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టీరియస్‌. మహి కోమటిరెడ్డి దర్శకుడు. జయ్‌ వల్లందాస్‌ నిర్మాత. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేశారు.  సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వినూత్న కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిదని, ఓ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయని అన్నారు. అభిద్‌ భూషణ్‌, రియా కపూర్‌, బాలరాజ్‌ వాడి, శ్రీనివాస్‌ భోగిరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు, సంగీతం: ఎమ్‌ఎల్‌ రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహి కోమటి రెడ్డి.

Social Share Spread Message

Latest News