Namaste NRI

కనెక్ట్ టు ఆంధ్రకి రూ.4 కోట్ల విరాళం

నాడు`నేడు పథకం రెండో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్‌ టు ఆంధ్రకి లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం ఇచ్చింది. 3, 4 విడతల్లో అదే మండలాల్లోని  మిగిలిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను లారస్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు కలిసి విరాళం చెక్కును, పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు కనెక్ట్‌ టు ఆంధ్ర సీవో వి.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]