
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సింగిల్. కార్తీక్రాజు దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్ పతాకంపై విద్యా కొప్పినీడి, భానుప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగే ఎంటర్టైనర్ ఇది. శ్రీవిష్ణు పాత్ర డిఫరెంట్ షేడ్స్తో సాగుతుంది. చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. కేతికశర్మ, ఇవాన, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్చంద్రశేఖర్, సంభాషణలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, రచన-దర్శకత్వం: కార్తీక్రాజు.
