ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఖర్కీప్లో తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో పర్యటించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆమె ఈ నెల 9వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు ఉక్రెయిన్ సరిహద్దులోని పోలాండ్లోని వార్సావ్, రోమేనియాలోని బుకారెస్ట్లో పర్యటించనున్నారు. రష్యాకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కమలా హారిస్ ఈ పర్యటన చేస్తున్నట్టు ఆమె డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ సబ్రినా సింగ్ తెలిపారు. ఉక్రెయిన్కు భద్రత, ఆర్థిక, మానవతా సాయంపై ఆయా దేశాలతో హారిస్ చర్చించనున్నట్టు తెలిపారు. తాము ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)