అఫ్గనిస్థాన్ పిల్లల చదువు విషయంలో తాలిబాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే వారం నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని విద్యా శాఖ మంత్రి అజీబ్ అహ్మద్ రయాన్ తెలిపారు. వచ్చే వారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నామని అన్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా విద్యా సంస్థలు నడుస్తాయని షరతు విధించారు. బాలికలకు సంబంధించిన విద్యా సంస్థల్లో మహిళా స్టాఫ్ మాత్రమే బోధిస్తారని అన్నారు. అయితే రిమోట్ ప్రాంతాల్లో మహిళా స్టాఫ్ లేకపోతే వయస్సు మళ్లిన ఉపాధ్యాయులు బాలికలకు బోధిస్తారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విద్యా సంవత్సరానికి గాను విద్యా సంస్థల మూసివేత ఉండదని హామీ ఇచ్చారు.














