ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యా సైన్యంతోనే కాకుండా పలు దేశాలపై సైబర్ దాడులకు కూడా తెగబడిరదని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడిరచింది. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, అమెరికా లక్ష్యాలుగా రష్యాకు చెందిన మిలటరీ గూఢచారులు సైబర్ దాడులకు యత్నించారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఈ దాడులను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని వెల్లడిరచింది. ఏడు ఇంటర్నెట్ డొమైన్లను ఉపయోగించే ఈ బృందాన్ని స్ట్రోనియం అని పిలుస్తున్నారట. అయితే వీళ్లు టార్గెట్ చేసిన సంస్థల పేర్లను మాత్రం మైక్రోసాఫ్ట్ వెల్లడిరచలేదు.














