తమ లక్ష్యం నెరవేరే వరకు దాడి కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై దాడి తర్వాత పుతిన్ తొలిసారి మాస్కోలో పర్యటించారు. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలపై స్పందించారు. తమను ఒంటరి చేసేందుకు విదేశీ శక్తుల ప్రయత్నాలు విజయం సాధించలేవని అన్నారు. మరోవైపు తమ దేశంలో ఏ ఒక్క ప్రాంతాన్నీ వదులుకునేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నామని, భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉంటే యుద్దమే వచ్చేది కాదు కదా అన్నారు.














