ఉక్రెయిన్ రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జీ7 సదస్సుకు భారత్ను తప్పకుండా ఆహ్వానిస్తామని అతి త్వరలోనే భారత్కు అధికారికంగా ఆహ్వానం కూడా పంపుతామని జర్మనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశమే కాకుండా, జూన్లో జర్మనీ వేదికగా జరిగే మరో సమావేశానికి కూడా భారత్కు ఆహ్వానం ఉంటుందని జర్మనీ అధికారులు అనధికారికంగా పేర్కొంటున్నారు. ఉక్రెయిన్` రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించిన కారణంగా జీ7 సదస్సుకు భారత్ను ఆహ్వానించకూడదని జర్మనీ నిర్ణయించిందని సమాచారం. కానీ ఆ తర్వాత జర్మనీ మనస్సు మార్చుకుందని, జీ 7 సదస్సుకు భారత్ను ఆహ్వానించిందుకు రెడీ అయిందని తెలిసింది.జీ 7 సదస్సుకు భారత్కు ఆహ్వానం లేదని వార్తలు వస్తున్నా, భారత ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. జర్మనీయే స్పందించి భారత్కు ఆహ్వానం పంపుతామని అనధికారికంగా పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)