స్వర్ణ, సిక్కోలు శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో వంశీరాజు తెరకెక్కించిన చిత్రం హారర్ వవిత్ టెర్రర్. పి.జనార్థన్ రెడ్డి నిర్మించారు. ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ టి.రాజు సమర్పణలో పీజేఆర్ ఫిలింస్ బ్యానర్పై పి.జనార్థన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. ఆద్యంతం ఆసక్తిరేకెత్తించే కథనంతో ఈ సినిమా తెరకెక్కించాం. ఘన విజయాన్ని అందుకొని మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో స్వర్ణ, శ్రీనివాస్, రామ సత్యనారాయణ, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ నాయుడు, సంగీతం: అర్జున్ ప్రసాద్.














