పాకిస్థాన్ పర్యటనలో ఉన్న అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను సందర్శించడాన్ని భారత్ ఖండిరచింది. ఇది ఆమె సంకుచిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొంది. ఆ ప్రాంతం భారత్లోని జమ్మూ`కశ్మీర్లో అంతర్భాగం. పాక్ ఆక్రమించిన దాన్ని సందర్శించడం ఆమె సంకుచిత మనస్తత్వాన్ని చూపుతోంది అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. పాక్తో పాటు పీవోకేలో పర్యటించనున్నారు. పాక్లో అమెరికా ప్రతినిధులు పర్యటించినప్పుడల్లా కశ్మీర్ అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్తో ఇల్హాన్ ఒమర్ చర్చల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు రానుందని తెలుస్తున్నది.














