కార్లకు ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్లను జారీ చేస్తారు. ఫ్యాన్నీ మొబైల్ ఫోన్ నెంబర్లను కూడా వేలం వేశారు. అయితే దుబాయ్లో నెంబర్ ప్లేట్ల వేలం జరిగింది. ఈ వేలంలో ఎఎ8 నెంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూడవ నెంబర్ ప్లేట్గా రికార్డు క్రియేట్ చేసింది. ఎఎ8 సింగిల్ డిజిటల్ నెంబర్ దుబాయ్లో వేలంలో 35 మిలియన్ల దీరమ్లకు అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో దాని విలువ రూ.70 కోట్లు. గత ఏడాది ఎఎ9 నెంబరు ప్లేట్ను రూ.79 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి పోటాపోటీగా వేలం జరిగింది. వన్ బిలియన్ మీల్స్ సంస్థ కోసం ఈ వేలం ద్వారా 53 బిలియన్ల దీరమ్లు ఆర్జించారు. ఆ డబ్బుతో 50 దేశాల్లో నిరుపేదలకు ఆహారం అందిచనున్నారు.














