ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆటా తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్ కమిటీ చైర్మన్ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ చైర్మన్ జయంత్ చల్లా ఉన్నారు. వాషింగ్టన్ డీసీ జూలై 1 నుంచి 3 వరకు 17వ ఆటా మహాసభలు జరగనున్నాయి.
