అమెరికా ముందుకు రాకపోవడంతో గతంలో భారత్ తన అవసరం కోసం రష్యాకు సన్నిహితమైందని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. కంగ్రెషనల్ కమిటీ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్తో మైత్రికి అమెరికా ప్రయత్నించకపోవడం వల్లే గతంలో ఆ దేశం రష్యాకు దగ్గరైందని అన్నారు. భారత్తో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు బైడెన్ పలుమార్లు నేరుగా ప్రధానితో మోదీతోనూ, భారత నాయకత్వంతోనూ చర్చలు జరుపుతున్నారన్నారు.














