వైద్య చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. జన్యుపరంగా మార్పులు చేసిన రెండు పంది గుండెలను మనుషులకు అమర్చడంలో అమెరికా వైద్యులు విజయవంతమయ్యారు. న్యూయార్క్లోని లాంగ్వన్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్లో ఈ ఆపరేషన్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు రోగులకు ఈ గుండెల్ని అమర్చామని, గుండెల పనితీరు సాధారణంగానే ఉన్నదని తెలిపారు. పంది గుండె మనిషికి అమర్చడం ఈ ఏడాది రెండోసారి. మేరీల్యాండ్లో గత జనవరిలో ఓ పేషెంట్కు ఈ తరహా చిక్సిత చేశారు. అయితే రెండు నెలల తర్వాత గుండెలో పందికి చెందిన డీఎన్ఏ వైరస్ అలాగే ఉండిపోయినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ రోగి మరణించాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)