Namaste NRI

తెలుగు చిత్రసీమలో సమ్మె సైరన్‌… ఆగస్టు 1 నుంచి

తెలుగు చిత్రసీమలో సమ్మె సరైన్‌ మోగింది. ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలు ఆపేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయని, పెరిగిన ఖర్చులకు, వస్తున్న  రాబడికి పొంతన లేక నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిల్డ్‌ తెలిపింది. ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేసి తీవ్రంగా నష్టపోతున్నామని, అందుకే ప్రస్తుతం నిర్మాతలెదుర్కొంటున్న సమస్యలన్నింటిపై చర్చించి ఆరోగ్యకరమైన వాతావరనాన్ని తీర్చిదిద్దేందుకు నిర్మాతలంతా స్వచ్ఛందంగా ఆగస్టు 1 నుంచి చిత్రీకరణ నిలిపివేస్తున్నట్లు గిల్డ్‌ పేర్కొంది. ప్రస్తుత సమస్యలన్నీ ఓ కొలిక్క వచ్చేవరకు ఈ బంద్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.  ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్‌కు వెళ్లవచ్చు అని ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events