Namaste NRI

భారత సంతతి బాలికకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

భారత సంతతికి చెందిన ఏడు సంవత్సరాల బ్రిటన్‌ బాలిక మోక్షారాయ్‌ ప్రతిష్ఠాత్మక బ్రిటన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌ అవార్డును గెలుచుకుంది. మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె మూడేళ్ల ప్రాయం నుంచే స్వచ్ఛందంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో సేవలకు గుర్తింపుగా బ్రిటన్‌ ఉపప్రధాని ఆలివర్‌ డౌడెన్‌ బాలికకు అవార్డును అందజేశారు. ఆర్థిక సహకారం అవసరమైన చిన్నారులను ఆదుకునేందుకు నిధుల సేకరణ సహా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై పలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మోక్ష గుర్తింపు పొందారు.

Social Share Spread Message

Latest News