పర్యావరణ సవాళ్లను పరిష్కరించే చొరవ చూపినందుకు ఐదుగురు భారతీయ యువకులకు 2023 అంతర్జాతీయ యంగ్ ఎకోహీరో అవార్డ్ లభించింది. అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ యాక్షన్ ఫర్ నేచర్ ఈ యువకులను గుర్తించింది. మీరట్కు చెందిన ఎయిహ దీక్షిత్, ముంబైకి చెందిన కర్ణవ్ రస్తోగి, బెంగళూరుకు చెందిన మాన్యహర్ష, న్యూఢిల్లీకి చెందిన నిర్వాణ్ సొమనీ, మన్నత్ కౌర్ అవార్డు విజేతలుగా వచ్చారు. ఇండిపెండెంట్ జడ్జిలు, పర్యావరణ శాస్త్ర , బయోలజీ, విద్యారంగ నిపుణులతో కూడిన ప్యానెల్ వీరిని విజేతలుగా నిర్ణయించింది. అత్యంత క్లిష్టమైన వాతావరణ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సంస్థ 8 నుంచి 16 ఏళ్ల పిల్లలను, యువకులను గత ఇరవై ఏళ్లు గా ప్రోత్సహిస్తోంది.
