Namaste NRI

డిట్రాయిట్‌లో పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీ

అమెరికాలోని పేదవాళ్ళకు సహాయం చేసేందుకు వీలుగాఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షుడు డా. నవనీతకృష్ణ గొర్రెపాటి ప్రవేశపెట్టిన తానా బ్యాక్‌ ప్యాక్‌ పథకంలో భాగంగా డిట్రాయిట్‌లోని మౌండ్‌ పార్క్‌ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌ లను పంపిణీచేశారు. డిటిఎ మాజీ ప్రెసిడెంట్‌ నీలిమ మన్నె, తానా నాయకులు సునీల్‌ పంట్ర, జేఆర్‌. శ్రీనివాస్‌ గోగినేని సహాయంతో దాదాపు 400 మంది విద్యార్థులకు ఈ బ్యాగ్‌ లను అందించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ నాయకులు వెంకట్‌ ఎక్కా, వినోద్‌ కుకునూర్‌, రాంప్రసాద్‌ చిలుకూరు, కిరణ్‌ దుగ్గిరాల, సుబ్రత గడ్డం, సుధీర్‌ కట్ట, జోగేశ్వరరావు పెద్దిబోయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగ్‌లను పంపిణీ చేసిన దాతలకు స్కూల్‌ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events