Skip to main content

Namaste NRI

చైనాను మించిన భారత్‌ .. 2025లో రెట్టింపు కంటే ఎక్కువ నమోదు

కొత్త కుబేరుల పెరుగుదలలో చైనాను భారతదేశం మించిపోయింది. యూబీఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ రిపోర్టు 2026 ప్రకారం 2025లో భారతదేశంలో యూఎస్‌ డాలర్‌ మిలియనీర్లు 31,033 మంది పెరిగారు. 14,079 బిలియనీర్ల చైనాతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. కాగా, భారతీయులు ధనవంతులు అవుతున్నప్పటికీ వారు ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో వలే తమ సంపదను నిల్వ చేయడం లేదు. సంపదకు యూబీఎస్‌ ఇచ్చే నిర్వచనం ఆర్థిక ఆస్తులు, ప్లస్‌ వాస్తవ ఆస్తులు ప్రధానంగా గృహాలు, అందులోంచి అప్పులు తీసివేస్తారు. ఆ విధంగా కొలిచినప్పుడు భారత దేశ స్థూల వ్యక్తిగత సంపదలో కేవలం 25.8 శాతం మాత్రమే ఆర్థిక ఆస్తుల రూపంలో ఉన్నది.

అదే సమయంలో అమెరికాలో 78.9 శాతం, జపాన్‌లో 68.9 శాతం, దక్షిణ కొరియాలో 51.9 శాతం ఉన్నది. ఆ విషయంలో భారతదేశం పట్టికలో అడుగున ఉంది. చైనాలో 53 లక్షల మందికి పైగా డాలర్‌ మిలియనీర్లు ఉన్నారని యూబీఎస్‌ అంచనా. భారత దేశంలో 9.44 లక్షల మంది ఉండగా, అమెరికా 2.36 కోట్ల మందికి పైగా మిలియనీర్లతో అగ్ర స్థాయిలో ఉన్నది.

Social Share Spread Message

Latest News