Skip to main content

Namaste NRI

ఓటమికి దగ్గరలో ఎర్రబెల్లి దయాకర్ : ఝాన్సీ రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రెగులా గ్రామం మరియు రెగులా తండా గడప గడపకు కాంగ్రెస్ – పల్లె పల్లెకు ఝాన్సమ్మ కార్యక్రమంలో భాగంగా బతుకమ్మలతో, బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామం మహిళలు.అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేసింది ఏమీ లేదని కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి పాల్పడ్డారని రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేటీఆర్, కెసిఆర్ ఖజానా నింపుకుంటే, పాలకుర్తిలో దగా దయాకర్ రావు మిషన్ భగీరథ పేరుతో నాణ్యతలేని పనులు చేసి వేల కోట్ల రూపాయలు తన ఖజానాలు వేసుకున్నాడు. రాష్ట్రంలో కేడీని, పాలకుర్తిలో ఈ దొంగని తరిమికొట్టేందుకు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.

దళిత బందు, రైతుబంధు, గృహలక్ష్మి, బీసీ బందు అని ఓట్ల కోసం మోసం చేయడం తప్ప ఎర్రబెల్లి చేసింది ఏమీ లేదు.ఓటమికి చాలా దగ్గరలో ఉనాడు ఎర్రబెల్లి, అందరూ ఓటు వేసే ముందు ఆలోచించాలి దౌర్జన్యం చేసే రాజ్యం కావాలా? మన బాగు చూసే ప్రభుత్వం కావాలా ఆలోచించండి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుండి ఒక సైనికునిలా పని చేయాలన్నారు.

Social Share Spread Message

Latest News