Namaste NRI

తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే: మహేష్‌ బిగాల

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వివిధ జిల్లాలలో ఎన్నారైలు పాల్గొంటున్నారని బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల అన్నారు.  తెలంగాణ భవన్‌లో ఎన్నారైల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మీడియాతో మాట్లాడుతూ  ప్రచారంలో బీఆర్‌ఎస్‌ దూసుకెళ్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించే దశలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఎజెండా లేదు. కేవలం కేసీఆర్‌ను తిట్టడమే వారి ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పది పథకాలు గురించి ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్‌లో మాత్రం పది మంది సీఎం సీట్ల కోసం పోట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎన్నారైలంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. తెలంగాణ ప్రగతి కండ్లముందు కనపడుతున్నది. ఎన్నారైలు అంతా కలిసి బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పోరాడుతామన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, అశోక్ దూసరి, చందు తల్లా, పూర్ణ బైరి, విన్నీ గౌడ్, విష్ణు జైగుండా వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events