తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం హను-మాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కే నిరంజన్రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ నిరంజన్ గారి లాంటి నిర్మాత దొరకడం మా అదృష్టం. హను-మాన్ విజయం ప్రేక్షకులదే. ఎన్నో క్లోజింగ్ థియేటర్స్ ఈ సినిమాతో ఓపెన్ కావడం ఆనందాన్నిచ్చింది. మూడో వారంలోనూ హౌస్ఫుల్ బోర్డు చూడటం మేకర్స్కి గొప్ప తృప్తినిస్తుంది. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడుతుంది. హను-మాన్ కు చాలా వేడుకలు చేయనున్నాం.
ఈ సినిమాకు పనిచేసినవాళ్లందరికి గిఫ్ట్స్ ఉండబోతున్నాయి. ప్రేక్షకులు హను-మాన్ సినిమాను చూస్తూ థియేటర్లను దేవాలయాలుగా భావిస్తున్నారు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ అయోధ్య ఆలయానికి ఐదు రూపాయలు విరాళం చేస్తున్నారు. ఈ సినిమా లాభాలను దేవుళ్లకు, సినిమాలు తీయడానికే ఖర్చు పెడతాం. ఈ చిత్ర సీక్వెల్ జై హనుమాన్తో అందరి రుణం తీర్చుకోబోతున్నాను. హను-మాన్ కన్నా జై హనుమాన్ వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఇంటర్నేషనల్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. హీరో తేజ మాట్లాడుతూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం అని అన్నారు.