Namaste NRI

అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్ధిల్లుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. బోచాసన్‌వాసీ శ్రీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఈ దేవాలయాన్ని నిర్మించింది. ఇది అబుదాబిలో తొలి రాతి హిందూ దేవాలయం కావడం విశేషం.  

భారత్‌, అరబ్‌ దేశాలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించాయి. హిందూ మతంలోని వైష్ణవుడైన స్వామి నారాయణ సంప్రదాయానికి చెందిన బోచసన్యాసి అక్షర్‌ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ (బీఏపీఎస్‌) ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిలో 13.5 ఎకరాల భూమిని ముస్లిం రాజు అయిన షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయానికి వాస్తు శిల్పిగా క్యాథలిక్‌ క్రిస్టియన్‌,  ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా సిక్కు మతస్థుడు ఉన్నారు. ఫౌండేషన్‌ డిజైనర్‌ బుద్దిస్ట్‌ కాగా, నిర్మాణ సంస్థ పార్సీలకు చెందినది. డైరెక్టర్‌ జైన మతానికి చెందిన వ్యక్తి అని బీఏపీఎస్‌ ప్రతినిధి వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events