ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డారు ఓ ఆగంతకుడు. బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్కు చేరుకున్న క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది.
సీఎం జగన్పై క్యాట్ బాల్తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది.వెంటనే సీఎం జగన్కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు జగన్. విజయవాడలో సీఎం జగన్ కోసం జనం పోటెత్తారు. విజయ వాడ సిటీలో మూడున్నర గంటలుగా జగన్ బస్సు యాత్ర అప్రతిహతంగా భారీ రోడ్ షో కొసాగించారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్ఆర్ సీపీ నేతలు అంటున్నారు. ఈ సంఘటనతో క్యాడర్ నివ్వెర పోయారు.