Namaste NRI

త్వరలో భారత పర్యటనకు పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, పుతిన్‌ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పుతిన్‌ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు.  

అయితే, పుతిన్‌ పర్యటనకు సంబంధించి కచ్చితమైన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్‌ భారత్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి కానున్నది. ఈ పర్యటన పుతిన్‌కు ఎంతో కీలకం కానున్నది.వాస్తవానికి రష్యా, భారత్‌ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం అగ్రనేతలు సంవత్సరంలో ఒకసారి ఒకరి దేశంలో మరొకరు సంప్రదించాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events