Namaste NRI

డబ్లుటీవో కు డొనాల్డ్ ట్రంప్ షాక్

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటీవో)కు అమెరికా నుంచి వెళ్లే నిధులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తర వేశారు. ట్రంప్ కార్యవర్గం అనుసరిస్తున్న వ్యాపార రక్షణాత్మక వైఖరిని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ట్రంప్ అధికారం లోకి వచ్చింది మొదలు ప్రపంచ స్థాయి వేదికల నుంచి అమెరికాను పక్కకు తప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి అమెరికా వైదొలిగినట్టు ప్రకటించారు. తాజాగా డబ్లుటీవోకు నిధులను నిలిపివేశారు. దీంతోపాటు అనేక దేశాలకు అందించే విదేశీ సాయాన్ని కూడా నిలిపివేశారు. వాస్తవానికి 2019 లోనే ట్రంప్ డబ్లుటీవోను బలహీనపర్చారు. నాడు ఆ సంస్థలో న్యాయమూర్తుల నియామకాలను ఆయన నిలిపివేశారు. దీంతో ఆ సంస్థ వివాద పరిష్కార వేదిక విభాగం బలహీనపడిపోయింది.

2024లో డబ్లుటివో నిర్వహణకు 232 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ప్రపంచ వాణిజ్యం ప్రతిదేశం వాటా ఆధారంగా ఈ సంస్థకు నిధులు సమకూరుస్తారు. ఇక అమెరికా నుంచి దీనికి దాదాపు 11 శాతం అందుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events