Namaste NRI

అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం..  పాకిస్థాన్ హెచ్చరిక

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ విధించిన ఆంక్షలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్‌ మంత్రి భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆ దేశ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ బహిరంగంగానే హెచ్చరించారు. పాకిస్థాన్‌ ఆయుధగారంలో ఘోరి, షాహిన్‌, ఘజ్నవి క్షిపణులు సహా 130 అణు వార్‌హెడ్‌లు కేవలం భారత్‌ కోసమే సిద్ధంగా ఉంచినట్టు ఆయన చెప్పారు. భారత్‌ సింధూ జలాల సరఫరాను నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలని అన్నారు. పాకిస్థాన్‌లోని అణు ఆయుధాలు ఉన్నవి కేవలం ప్రదర్శించడానికి కాదని, తమ దేశంలోని వివిధ రహస్య ప్రదేశాల్లో వాటిని ఉంచామని, ఏమాత్రం రెచ్చగొట్టినా దాడిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. భారత్‌ ప్రకటించిన ఆంక్షలు, ఇతర నిర్ణయాలకు తీవ్ర పరిణామాలు తప్పవని తెలిపారు. తమ గగనతలం మూసివేత కొనసాగిస్తే మీ వైమానిక సంస్థలు దివాళా తీయడం ఖాయమని అన్నారు.

Social Share Spread Message

Latest News