అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పీనట్ డైమండ్. ఇప్పుడీ టైటిల్ను రామ్ అసుర్ గా మార్చారు. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్పి మీడియో హౌస్, జీవీ ఐడియాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్లుక్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్బంగా హీరో, నిర్మాత అభివన్ సర్ధార్ మాట్లాడుతూ విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇలాంటి కాన్సెప్ట్ ఇంత వరకు ఏ చిత్రసీమలోనూ రాలేదు. ఇది నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది అన్నారు.














