
అమెరికాలోని బోస్టన్ గ్లోబల్ ఫోరం, ఏ1 వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ను బోస్టన్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు 2025 వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును ప్రదానం చేశారు. భారత్తో పాటు ప్రపంచంలో శాంతి, పరిరక్షణ, నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందజేశామన్నారు. కొలంబియా, ఇరాక్, శ్రీలంక వంటి దేశాలలో శాంతి స్థాపనకు ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం. ఇటీవల సియాటెల్ నగరం కూడా ఆయన సేవలను గుర్తించి అక్టోబర్ 19ను శ్రీశ్రీ రవిశంకర్ దినంగా ప్రకటించింది.















