Skip to main content

Namaste NRI

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రతిష్టాత్మక వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు

 అమెరికాలోని బోస్టన్‌ గ్లోబల్‌ ఫోరం, ఏ1 వరల్డ్‌ సొసైటీ ఆధ్వర్యంలో భారత ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ను బోస్టన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు 2025 వరల్డ్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ అవార్డును ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచంలో శాంతి, పరిరక్షణ, నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందజేశామన్నారు.  కొలంబియా, ఇరాక్, శ్రీలంక వంటి దేశాలలో శాంతి స్థాపనకు ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం. ఇటీవల సియాటెల్ నగరం కూడా ఆయన సేవలను గుర్తించి అక్టోబర్ 19ను శ్రీశ్రీ రవిశంకర్ దినంగా ప్రకటించింది.

Social Share Spread Message

Latest News