హాంకాంగ్, 21 ఫిబ్రవరి 2026- హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) తుంగ్ చుంగ్లోని NAAC సెంటర్ ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (IMLD) వేడుకలను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి చేసిన ప్రయత్నాలకు పరాకాష్టగా నిలిచింది, ముఖ్యంగా 2021లో COVID-19 మహమ్మారి సమయంలో పిల్లలు మరియు తల్లిదండ్రులలో మాతృభాషల ప్రాముఖ్యతను ప్రోత్సహించాలని ఆమె సంకల్పించింది సఫలీకృతమైందని తమ ఆనందాన్ని తెలిపారు.

2021 జూమ్ మాధ్యమంలో మొదలెట్టినప్పటినుంచి, ఈ కార్యక్రమానికి UNESCO హాంకాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్ మద్దతునిచ్చింది మరియు ఈ సంవత్సరం NAAC వేదికను మద్దతు ఇవ్వగా, టుమారోస్ యూత్ డెవలప్మెంట్ ఫండ్ లిమిటెడ్ (TYFDL) కూడా మద్దతునిచ్చారు. UHKA గ్లోకల్ పీస్ సెంటర్లో కమ్యూనిటీ విభాగానికి కో-చైర్గా సేవలందిస్తున్న శ్రీ తిరునాచ్ నాచియాపన్, IMLD 2026 కన్వీనర్గా సహాయపడ్డారు.


ఈ సంవత్సరం IMLD థీమ్ “యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్” లో పిల్లలు ఉత్సాహంగా నృత్య గాన ప్రదర్శనలు మరియు థీమ్ గురించి మాట్లాడారు, వారు సంస్కృతం, ఇంగ్లీష్, కొరియన్, చైనీస్, బంగ్లా, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మార్వారీ మరియు మరాఠీలతో సహా వారి మాతృభాషల పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు.


ఈ కార్యక్రమానికి హాంకాంగ్ మరియు మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుండి గౌరవనీయ కాన్సుల్ ‘మిస్ సురభి గోయల్’ గౌరవ ముఖ్య అతిధిగా విచ్చేసారు. గౌరవ కాన్సుల్ తన ప్రసంగంలో, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ప్రతి ఏటా IMLD నిర్వహిస్తున్నందుకు అభినంచించారు. పిల్లలు తమ మాతృ భాష నేర్చుకుంటున్నందుకు, అభిమానిస్తున్నందుకు వారి తల్లిదండ్రుల ప్రయత్నాలను ప్రశంసించారు. భవిష్యత్తును, ప్రతిభావంతులుగా ఎదుర్కోగల ప్రపంచ పౌరులుగా మారడానికి బహుభాషా నైపుణ్యం తప్పనిసరి అని నొక్కి చెప్పారు. ఆధునిక హిందీ సాహిత్య పితామహుడు భరతేందు హరిశ్చంద్రను ఉటంకింస్తూ, మాతృభాష అన్ని జాతీయ మరియు వ్యక్తిగత పురోగతికి పునాది అని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించిందని, పాల్గొన్నవారు మరియు హాజరైనవారు వారి మాతృభాషలను సంరక్షించడం మరియు ప్రోత్సహించడం మెచ్చుకోతగ్గ విషయమని, ముఖ్య నిర్వాహకులైన జయ పీసపాటిని అభినందించారు .

NAAC ప్రాంతీయ డైరెక్టర్ మిస్ కోనీ వాంగ్,UNESCO HKGPC ప్రాజెక్ట్స్ ఆఫీసర్ మిస్టర్ మారకో క్వాన్గ్, TYFDL డైరెక్టర్ మిస్టర్ జాకీ చెంగ్, చైనా బాంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ సెంటర్ అధ్యక్షులు డా.ఇస్లాం ముహమ్మద్ ఫ్యాక్రుల్ బాబు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచ పౌరులుగా విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలతో వ్యక్తులను సన్నద్ధం చేయడానికి మాతృభాషలు మరియు ఇతర భాషలను నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతనువీరందరూ కూడా సమర్థించారు.


బహుళ సంస్కృతులు కలిగిన దేశంలో, ప్రప్రథంగా తమ సమాఖ్య విభిన్న సమాజాలను వారి మాతృభాషలను కొనియాడటానికి వేడుకగా జరుపుకోవడానికి ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది, భాష మన వారసత్వంలో అంతర్భాగమని మేము విశ్వసిస్తున్నాము మరియు యువ తరంలో దాని ప్రాముఖ్యతను ప్రోత్సహించడం చాలా అవసరమని హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక సభ్యురాలు జయ పీసపాటి అన్నారు.


సాంస్కృతిక అంతరాలను తగ్గించడంలో మరియు ప్రపంచ అవగాహనను ప్రోత్సహించడంలో భాష యొక్క శక్తికి ఈ కార్యక్రమం నిదర్శనం. ప్రపంచం మరింత పరస్పరం అనుసంధానించబడినందున, మన గుర్తింపులను రూపొందించడంలో మరియు ప్రపంచ పౌరసత్వాన్ని పెంపొందించడంలో భాష యొక్క ప్రాముఖ్యతను అతిశయోక్తి చేయలేము.















