సింగపూర్ ప్రభుత్వం భారతీయులకు శుభవార్త చెప్పింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన లేకుండా దేశంలోకి అనుమతించనున్నట్టు తెలిపింది. ఈ నెల 29 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇండోనేషియన్లకు ఈ నెల 29 నుంచి ఇది వర్తిస్తుందని, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ దేశాలకు మాత్రం డిసెంబరు 6 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తయిన ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స, ఖతర్ దేశ పౌరులకు కూడా క్వారంటైన్ నిబంధన ఎత్తివేస్తున్నట్టు తెలిపింది.














