తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















