అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభ, సెనేట్ పై పట్టు నిలబెట్టుకుంటే, ప్రతి వయోజన అమెరికన్కు 5,000 డాలర్లు (సుమారు రూ.4 లక్షలు) ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ట్రంప్ డివిడెండ్ గా పిలుస్తామని చెప్పారు.డల్లాస్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా తనను బ్యాలెట్పై ఉన్నట్టుగా భావించి పార్టీకి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. రిపబ్లికన్లు గెలిస్తే, మీరూ గెలిచినట్లే. మీకు 5,000 డాలర్లు వస్తాయి అని చెప్పారు.

ఈ పథకానికి కనీసం 1 ట్రిలియన్ డాలర్లు అవసరమయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడ నుంచి సమకూరుస్తారన్నది ట్రంప్ స్పష్టం చేయలేదు. మన దేశం చాలా డబ్బు సంపాదిస్తోంది అని చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగా ఈ ప్రతిపాదన అమలు చేయడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.















