Namaste NRI

ప్రవాస భారతీయుల పెట్టుబడుల కోసం.. ఇన్వెస్ట్ 19 వేదిక

ప్రవాస భారతీయులు భారత ఈక్విటీ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుగా ఒక గేట్‌వేను ఆవిష్కరించనున్నట్టు ఇన్వెస్ట్‌ 19 ప్రకటించింది. ఈ కంపెనీ ఇప్పటికే ఆన్‌లైన్‌ మల్టీబ్రోకింగ్‌ సేవలు అందిస్తోంది. ఒకే క్లిక్‌తో భారత ఈక్విటీల్లో పెట్టుబడుల అవకాశాలను ఎన్‌ఆర్‌ఐలకు కల్పించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు వివరించింది. నిర్ణిత శాతం మేర దేశ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని వారు భారత ఈక్విటీ మార్కెట్లలో సులభంగా ఇన్వెస్ట్‌ చేసుకునే మార్గం లేదని ఇన్వెస్ట్‌ 19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌసలేంద్రసింగ్‌ సెంగార్‌ తెలిపారు. ఈ కంపెనీ ఇప్పటికే ఆన్‌లైన్‌ మల్టీబ్రోకింగ్‌ సేవలు అందిస్తోంది.

Social Share Spread Message

Latest News