మహేష్బాబు, కీర్తిసురేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో జరుపనున్నట్లు మేకర్స్ వెల్లడిరచారు. ఈ వేడుకకి స్టార్ డైరెక్టర్ పూరీ రానున్నట్లు తెలిసింది. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సర్కారు వారి పాట ఎమోజీతో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. కొద్ది రోజులుగా దుబాయ్లో విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వరుసగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది. బ్యాంకింగ్ స్కామ్ల నేపథ్యంలో తెరకెక్కినీ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ రెట్టింపు అంచనాలను నమోదు చేసింది. ఈ నెల 12న విడుదలువుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.














