తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలండ్ దేశంలోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కారు. నారా చంద్రబాబు నాయుడు ఐటీ సెక్టార్ను అభివృద్ది చేయడం వల్లే తాము ఇక్కడి వరకు వచ్చి ఇలా ఉద్యోగాలు చేసుకునే స్థాయికి ఎదిగామని, ఆయనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలుపుతూ, పోలండ్ ఐటీ ఉద్యోగులు WeStandWithCBN ప్లకార్డులు ప్రదర్శించారు.














