తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మాలాశ్రీ. కథానాయికగా పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిశారామె. ఇప్పుడు ఆమె కుమార్తె రాధనా రామ్ కెమెరా ముందుకొచ్చింది. తరుణ్ సుధీర దర్శకత్వంలో దర్శన్ కథానాయకుడిగా ఇటీవల బెంగళూరులో డి56 పేరుతో ఓ చిత్రం మొదలైంది. రాక్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాక్లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత రాము, రాధనా రామ్ కథానాయికగా పరిచయమవుతోంది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా మాలశ్రీ మాట్లాడుతూ రాధానాకు చిన్నప్పటి నుంచే నటన ఇష్టం. ముంబయిలో నటన, డ్యాన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. నా కూతురు స్వయంకృషితో పరిశ్రమలో రాణించాలని కోరుకుంటున్నా అని చెప్పింది. రాధనా సినీ రంగ ప్రవేశంపై మాలాశ్రీ సంతోషం వ్యక్తం చేశారు.














