అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రపంచ ఆరాధ్య హార్ట్ఫుల్నెస్ ప్రచారకర్త కమలేష్ పటేల్ (దాజీ)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ దాజీతో పరిచయం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దాజీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. రాజకీయాల్లో ఉండటం వల్ల యోగా చేయడం లేదన్నారు. దాజీ స్ఫూర్తితోనైనా యోగా చేయడానికి ప్రయత్నిస్తానన్నారు.




























