Namaste NRI

మోహాన్ లాల్, మమ్ముట్టిలకు అరుదైన గౌరవం

యుఏఈ గోల్డెన్‌ వీసాలకు మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, మోహన్‌ లాల్‌లు ఎంపికయ్యారు. యూఏఈ గోల్డెన్‌ వీసా ప్రకటించినట్లు స్వయంగా మోహన్‌ లాల్‌ వెల్లడిరచారు. యూఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులకు గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వడం ఇదే మొదటిసారి. గోల్డెన్‌ వీసా, 2019 లో యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వీసా ద్వారా అక్కడ స్థిర నివాసం చేర్పరుచుకోవచ్చు. అంతేగాక ఎలాంటి జాతీయ స్పాన్సర్‌ లేకుండానే 10 సంవత్సరాల పాటు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వీసా గడువు పూర్తి కాగానే ఆటోమెటిక్‌గా రెన్యూవల్‌ అవుతుంది.

Social Share Spread Message

Latest News