Skip to main content

Namaste NRI

నమీబియా అధ్యక్షుడు గింగోబ్‌ ఇకలేరు

నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (82) ఇకలేరు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న హేజ్.. ఆదివారం తెల్లవారుజామున విండ్‌హోక్‌లోని లేడీ పోహంబా ఆస్పత్రిలో కన్నుమూశారు. నమీబియా అధ్యక్ష కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్‌ మృతిచెందారని సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌ చేశారు. 2014లో అస్వస్థతకు గురైన గింగోబ్‌ సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ సోకినట్లు తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్తానని కూడా హేజ్ పేర్కొన్నట్లు ప్రెసిడెన్సీ తెలిపింది. కానీ ఇంతలో ఆయన మరణించారు. 2014లో క్యాన్సర్‌ బారినపడిన గింగోబ్‌ మరుసటి సంవత్సరం అధ్యక్షుడయ్యారు.

Social Share Spread Message

Latest News