Namaste NRI

ఆందోళన వద్దు దేశ ప్రజలకు.. కేంద్రం భరోసా

హ్యూమన్‌ మెటాన్యుమోనియా(హెచ్‌ఎంపీవీ)తో సహా చైనాలో ఇటీవల పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ  దేశ ప్రజలకు భరోసా ఇచ్చింది. చైనాలో పరిస్థితి అసాధారణమేమీ కాదని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సంసిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసేందుకు సంయుక్త పర్యవేక్షణ గ్రూపుతో సమావేశం నిర్వహించింది.

అనంతరం ఓ ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్టు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. హెచ్‌ఎంపీవీ వంటి వైరస్‌లు భారత్‌లో ఇది వరకు నుంచే వ్యాప్తిలో ఉన్నాయని, అటువంటి కేసులను సమర్థంగా ఎదుర్కోగల యంత్రాంగం తమకు ఉందని ఆరోగ్య శాఖ హామీ ఇచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events