Namaste NRI

ఒలింపిక్స్ క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు

టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించిన ఆయన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఒలింపిక్‌ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని పేర్కొన్నారు. భారత ఒలింపిక్స్‌ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు. మహిళా క్రీడాకారులపై అభినందనలు కురిపించారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ భారతావని సంబురాలు చేసుకునేలా చేశారు. ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి ప్రదర్శన చేశారు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్ని సార్లు ఓడిపోతాం. కానీ ప్రతిసారీ కొత్త విషయాలను నేర్చుకొంటాం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, క్రీడాశాఖ మాజీ మంత్రి కిరణ్‌ రిజుజుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events