Namaste NRI

ఉద్యమకారుడికి దక్కిన గౌరవం  : రాధారపు సతీష్‌

ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలంకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి ఇవ్వడం పట్ల ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ బ్రహెయిన్‌ అధ్యక్షుడు రాధారపు సతీష్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ అనిల్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడం ఉద్యమకారుడికి దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ను స్థాపించిన అనిల్‌, తెలంగాణ వాదాన్ని ఖండాంతరాలకు తెలియజేశారని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events